జగనన్న పల్లె వెలుగు శిక్షణ తరగతులను ప్రారంభించిన జెడ్పీ సీఈవో

జగనన్న పల్లె వెలుగు శిక్షణ తరగతులను ప్రకాశం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి కైలాష్ గిరీశ్వర్ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మంగళవారం నాడు పొదిలి,మర్రిపూడి,కొండేపి మండలాల చెందిన గ్రామ పంచాయితీ కార్యదర్శిలు, ఎనర్జీ అసిస్టెంట్లు లకు జగనన్న పల్లె వెలుగు పథకం భాగం యల్ఈడీ వెలుగులను గ్రామాల్లో అమలు చేయడం పై శిక్షణ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో పొదిలి మండలం ఈఓఆర్డీ రాజశేఖర్, మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు