జగనన్న కృతజ్ఞత పాదయాత్ర కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు
జగనన్న కృతజ్ఞత పాదయాత్ర కు పొదిలి పట్టణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు స్వాగతం పలికారు.
వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేలు నుంచి విజయవాడ వరకు వాలంటీర్లు తలపెట్టిన పాదయాత్ర శనివారం నాడు పొదిలి పట్టణంలోకి చేరింది.
ఈ సందర్భంగా వైకాపా నాయకులు స్వాగతం పలికి వారికి భోజన వసతి మరియు పండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ, వాలంటీర్లు రసూల్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు