ఘనంగా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తెలుగు దేశం పార్టీ 40 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే తెలుగు దేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక పొదిలి పట్టణంలో పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఏర్పాటు తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక మార్పుకోసం, బిసిలకు రాజ్యాధికారం వాటాను కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు