ఏప్రిల్ 20 కి నగర పంచాయితీ కేసు వాయిదా

పొదిలి నగర పంచాయతీకి సంబంధించిన కేసు ఏప్రిల్ 20 తేదీకి వాయిదా పడింది.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయతీ పరిధి నుండి కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ స్వీకరించిన హైకోర్టు ద్విసభ్య బెంచ్ బుధవారంనాడు బెంచ్ పై విచారించే అవకాశం లేకపోవడంతో ఏప్రిల్ 1వ తేదీ గురువారం నాటికి ‌వాయిదా వేసిన విషయం తెలిసిందే.

హైకోర్టు ద్విసభ్య బెంచ్ ముందు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగర పంచాయతీలు, పురపాలక సంఘాలకు సంబంధించిన అన్ని కేసులను కలిపి ఒకేసారి విచారించి తదుపరి విచారణను ఏప్రిల్ 20 తేది మంగళవారం నాటికి ‌వాయిదా వేసింది.

తదుపరి ఏప్రిల్ 20 తేది జరిగే విచారణ రోజున హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుందని న్యాయవాద వర్గాల సమాచారం.