వరిగడ్డి వాములు‌ దగ్ధం 4 లక్షల రూపాయలు విలువ చేసే గడ్డి నష్టం

వరిగడ్డి వాములు‌ దగ్ధం అయ్యి 4 లక్షల రూపాయలు విలువ చేసే గడ్డి వాములు దగ్ధం ఆయన సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం పరిధిలోని ఓబులక్కపల్లి గ్రామ పరిధిలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వరిగడ్డి వాములకు దగ్ధం కావటంతో స్ధానికులు ఫైర్ అధికారులు కు సమాచారం అందించి స్థానికులు మంటలు అర్పించే ప్రయత్నం చేసారు

సమాచారం అందుకున్న కొండేపి ఫైర్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలు ఆర్పివేశారు.

ఫైర్ అధికారులు అంచనా ప్రకారం 4 లక్షల రూపాయలు విలువ చేసే గడ్డి వాములు దగ్ధం అయినట్లు తెలిపారు