పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులకు సన్మానం

పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 2004 సంవత్సరం 10వ తరగతి విద్య అభ్యసించిన విద్యార్థులు సమావేశం నిర్వహించి నాడు తమకు బోధనలు చేసిన ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.

చాలా సంవత్సరాల తరువాత అందరు ఒక్కచోట కలవటంతో తమ యొక్క కష్టనష్టాలను ఒకరికి ఒకరు భాగస్వామ్యం చేసుకొన్నారు.

అనంతరం పూర్వ విద్యార్ధులు అందరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్ధులు యస్ధాన్, జబ్బార్, శ్రీను, చిన్న,రవి, వేణు, రాంబాబు, పీటర్ పాల్ తదితరులు పాల్గొన్నారు