హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న ఆదిలక్ష్మి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా బొనిగాల ఆదిలక్ష్మి ప్రశంసాపత్రం అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు ఒంగోలు కోర్టు భవనాల సముదాయం నందు ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చెన్నంశెట్టి రాజు చేతుల మీదుగా
పారా లీగల్ వాలంటీర్ గా ఉత్తమ సేవాలందించిన పొదిలి పట్టణం చెందిన బోనిగల ఆదిలక్ష్మి ప్రశంసాపత్రం అందుకున్నారు.