పొదిలి పట్టణంలో కోవిడ్ తో మహిళ మృతి

కరోనా వైరస్ రెండో దశలో పొదిలి పట్టణం 8వ వార్డు పుల్లరపేట చెందిన మహిళకు కోవిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కావటంతో అధికారులు రెండు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం నాడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రభుత్వం వైద్య అధికారులు ధృవీకరించారు.

ప్రస్తుతం అధికారికంగా తొలి మృతి కాగా గత వారం నుంచి అనధికారికంగా మరో నాలుగురు మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం


పట్టణంలో ప్రమాదకర పరిస్థితుల్లో వెల్లకుండా ప్రతి ఒక్క పౌరుడు సామాజిక బాధ్యతతో సామాజిక దూరం మాస్క్ తప్పక ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.