అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పొదిలి అధికారులు పట్టివేత సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సాధారణ తనిఖీలో భాగం స్థానిక దరిశి రోడ్ లోని రైస్ మిల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ యస్ఐ రాజేంద్రప్రసాద్ కె వెంకట్రావు కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు