పొదిలిలో నేడు 45 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

పొదిలి మండలం పరిధిలో శనివారం నాడు నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు 45 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు 50 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా ఆర్టీసీ గ్రౌండ్ నందు 63 మందికి కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది

అదే విధంగా గ్రామీణ మండల పరిధిలోని కొండయిపాలెం గ్రామంలో నిర్వహించిన కోవిడ్ పాజిటివ్ పరీక్షలో 11 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది
మొత్తం పొదిలి మండలం లో 45 కేసులు నమోదు అయ్యాయి.

ప్రతి ఒక్క పౌరుడు సామాజిక బాధ్యతతో సామాజిక దూరం మాస్క్ తప్పక ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.