మరో సారి ఫ్రెండ్స్ ఫరెవర్ టీం ఆధ్వర్యంలో అంత్యక్రియలు

కరోనా సోకిందంటే చాలు అయినవాళ్లే దగ్గరికి రాని పరిస్థితులు నెలకొన్నాయి ఆఖరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కొన్ని కుటుంబాలు ముందుకు రావట్లేదు దీంతో అందరూ ఉండి కూడా దిక్కు లేని అనాథ శవాలుగా మారుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా విస్పోటనానికి మానవత్వం కూడా మంట కలిసిపోతున్న వేళ.. రెండు రోజుల క్రితం ఒక‌‌ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన ఫ్రెండ్స్ ఫరెవర్ టీం సోమవారం నాడు ఒక మహిళ కు అంత్యక్రియలు నిర్వహించారు.

వివరాల్లోకి స్థానిక పొదిలి నగర పంచాయితీ 2 వార్డు నందు నివాసం ఉంటున్న దమ్మలపాటి లక్ష్మమ్మ (80) సోమవారం నాడు మృతి చెందటంతో అంత్యక్రియలకు బంధువులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులకు సమాచారం తెలపటంతో వారు ముందుకు వచ్చి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఫ్రెండ్స్ ఫరెవర్ టీం సభ్యులకు పట్టణంలో పలువురు అభినందించారు.