పొదిలికొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆదాయం 7లక్షల 15 వేల 735 రూపాయలు

పొదిలి కొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానం ఆదాయం 7 లక్షల 15 వేల 735 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసులు ఒక ప్రకటన లో తెలిపారు.

హుండీ ద్వారా 5 లక్షల 99 వేల 895 రూపాయిలు, దర్శనం టికెట్ల ద్వారా 86 వేల 320 రూపాయలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 16 వేల 100 రూపాయలు తలనీలాలు టికెట్ల ద్వారా 13వేల420 రూపాయలు ఆదాయం వచ్చిందని గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో 6 లక్షల 90వేల58 రూపాయలు ఆదాయం రాగ ఈ ఏడాది అదనం గా25 వేల667 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు