దామచర్ల పమిడి అరెస్టు మర్రిపూడి స్టేషన్ కు తరలింపు

మార్కాపురం జిల్లా సాధన కోసం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో దేవస్థానం నుంచి అమరావతీ వరకు తలపెట్టిన సైకిల్ యాత్ర ప్రారంభించేందుకు ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న ఒంగోలు దరిశి నియోజకవర్గల తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ లు దామచర్ల జనార్ధన్,పమిడి రమేష్ లను పొదిలి పట్టణం మర్రిపూడి క్రాస్ రోడ్ వద్ద పొదిలి యస్ఐ శ్రీహరి అదుపులోకి తీసుకొని మర్రిపూడి పోలీసు స్టేషన్ కు తరలించారు.

మర్రిపూడి పోలీసు స్టేషన్ నందు దామచర్ల జనార్ధన్ పమిడి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా తలపెట్టిన యాత్రలను భగ్నం చేయటం కోసం అక్రమ అరెస్టులు పట్ల తీవ్రంగా ఖండించారు.