ఘనంగా తేదేపా 40వ వార్షికోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలను పొదిలి కొనకనమిట్ల మండలాల్లో ఘనంగా నిర్వహించారు

పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు.

కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని గొట్లగట్టు గ్రామ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ పతాకాన్ని కందుల నారాయణరెడ్డి ఆవిష్కరించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెక్ ను కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.

ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసి బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికారం వాటా కల్పించి బలహీన వర్గాల అండగా నిలిచారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అండగా ప్రతి ఒక్కరు ఉండి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పొల్ల నరసింహారావు, ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ మైనార్టీసెల్ అధ్యక్షులు షేక్ రసూల్ పొదిలి కొనకనమిట్ల మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, ఓబుల్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకులు సమంతపూడి నాగేశ్వరరావు, కాటూరి నారాయణ ప్రతాప్ , సయ్యద్ ఇమాంసా, చప్పిడి రామ లింగయ్య, కనకం నరసింహారావు,తెలుగు యువత పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మువ్వా కాటం రాజు యాదవ్ , నియోజకవర్గ అధ్యక్షులు సుకదేవ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు