ప్రమాదవశాత్తు డిష్ కొండలు మృతి

పొదిలి పట్టణంలోని కేబుల్ నెట్వర్క్ నందు పని చేస్తున్న డిష్ కొండలు ప్రమాదవశాత్తు కరెంట్ పోల్ పై నుంచి పడి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక బెస్త పాలెం నందు కేబుల్ నెట్వర్క్ పనులు నిమిత్తం కరెంట్ పోల్ పై కేబుల్ వైరు మర్మత్తులు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో హుటాహుటిన స్థానిక పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కు తరలించగా ఒంగోలు లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్ల బంధువర్గల సమాచారం.

సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది