శుభకృత్ నామ ఉగాది కవి సమ్మేళనం

శుభకృత్ నామ ఉగాది పర్వదిన సందర్భంగా భగవన్ శ్రీ సత్యసాయి ధ్యాన మందిరం నందు కవిసమ్మేళనానికి “విశ్వాక్షరం” పుస్తక రచయిత, కవి పావులూరి మల్లికార్జునరావు “ప్రయోక్త” గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీనివాసులు, షేక్ మస్తాన్ ,జి రమణారెడ్డి పారెళ్ళ బాలా ఆంజనేయులు తమ తమ కవితలతో శ్రోతలను అలరింపజేశారు.

ఈ సందర్భంగా కవులను వెన్నెల మల్లికార్జునరావు పద్మజ దంపతులు మెమెంటోలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సాయి ధ్యానమందిరం నిర్వాహకులు సాయిరాం , సత్యం, ఉపాధ్యాయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.