మర్రిపూడి తహశీల్దారు గా సాజిద

మర్రిపూడి మండల రెవెన్యూ తహశీల్దారు గా షేక్ సాజిద ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

మర్రిపూడి మండల అదనపు తహశీల్దార్ గా పనిచేస్తున్న ప్రభాకరరావు అద్దంకి రెవెన్యూ తహశీల్దారు పూర్తి బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం అద్దంకి మండలం బాపట్ల జిల్లాలో వెళ్లటంతో
మండలంలో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న షేక్ సాజిద కు తహశీల్దారు గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ సందర్భంగా మండల రెవెన్యూ సిబ్బంది తహశీల్దారు షేక్ సాజిద ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు రమేష్ సందీప్, నాగేశ్వరరావు, దేవ కరుణా, రామాంజనేయులు ,మస్తాన్ ,జిలాని, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు