ట్రైల్ రన్ పేరుతో బైక్ పరారైన దొంగ

ట్రైల్ రన్ పేరుతో ద్విచక్ర వాహనంతో పరారైన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం చెందిన ముత్తుమల కొండారెడ్డి అనునతను తన రాయల్ ఇన్ ఫీల్డ్ బులెట్ ను OLX యాప్ ద్వారా అమ్మకానికి పెట్టిగా తేది 4.4.22 న రాత్రి 10.00 గంటల సమయలో శ్రీకాంత్ అనే వ్యక్తి మరొక వ్యక్తి తోపాటు వచ్చి బులెట్ ను చెక్ చేసుకుంటానని చెప్పి ట్రయిల్ రన్ కి వెళ్లి తిరిగి వచ్చి మోటార్ సైకిల్ లో సౌండ్ వస్తున్నాడని చెప్పి మరల మార్కాపూర్ వైపు వెళ్లి తిరిగి వెళ్ళి ఎంతకు తిరిగి రాకపోవడంతో ఫిర్యాదుదారుడు ముత్తమల కొండా రెడ్డి అతని తమ్ముడు మరియు కొత్త వ్యక్తి ముగ్గురు కలసి వెదకగా శ్రీకాంత్ మోటార్ సైకిల్ తో పారిపోయినట్లు, అతనితో పాటు ఉన్న వ్యక్తిని విచారించగా అతనికి తనకు సంబధం లేదని, తనను నరసరావు పేట నుండి తన స్నేహితుని పెళ్లి కి వీడియో తీయాలని తీసుకుని వచ్చినట్లు తెలుపగా సదరు శ్రీకాంత్ మోసం చేసి తన బైక్ ను దొంగతనంగా తీసుకుని వెళ్ళినట్లు గా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు యస్ఐ శ్రీహరి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.