మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎలకల మందు తాగి వ్యక్తి మృతి

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మద్యం లో ఎలకల మందు తాగి మృతి చెందిన సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ‌మాదలవారిపాలెం చెందిన పారి యాకోబు (65) మద్యానికి బానిసై భార్య నవమ్మ మందుకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది మద్యం లో ఎలకల మందు కలుపుకొని మద్యం సేవించడం వల్ల మృతి చెందారని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని యస్ఐ శ్రీహరి మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.