ఎంఎల్ఏ కుందూరు ఆధ్వర్యంలో వాలంటీర్లు కు సన్మానం

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.

 

వివరాల్లోకి వెళితే పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు కొండాయిపాలెం గ్రామ పంచాయతీ చెందిన వాలంటీర్లుకు సేవా పురస్కారాలను అందించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవాలు మరువలేనివి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్ సన్నెబోయిన మాధవి మరియు పంచాయితీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు