18న నిర్మమహేశ్వర స్వామి భూములు కౌలు వేలం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

నిర్మమహేశ్వర స్వామి దేవాలయం చెందిన భూములు కౌలు వేలం మే 18వ తేదిన స్థానిక శివాలయం నందు 10 గంటలకు జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు.

పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 457/1,2 లోని 45.13 ఎకరాల భూమికి రెండు సంవత్సరాలకు కౌలు వేలం పాటను నిర్వహిస్తున్నట్లు పాటలో పాల్గొనే వారు 10 వేలు రూపాయలు ధరవత్తు చెల్లించాలని హెచ్చు పాటదారుడుకు కౌలు మంజూరు చేస్తారని తెలిపారు.