హబీబుల్లా బేగ్ సంస్థ ఆధ్వర్యంలో మైక్ సెట్ పంపిణీ

  • హబీబుల్లా బేగ్ సంస్థ సేవాలు స్వూర్తిదాయకం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మైక్ సెట్ పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు పంపిణీ చేశారు

మంగళవారం నాడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ హబీబుల్లా బేగ్ సంస్థ సేవాలు స్వూర్తిదాయకం అని అదే విధంగా అర్హత కల్గిన సేవాలు అందింతే ప్రయోజనం ఉంటుంది అన్నారు

చైర్మన్ కరిముల్లా బేగ్ మాట్లాడుతూ సామాజిక సేవా చెయ్యాలనే తన తపనలో నా కుమారుడు ఆర్థిక సహాకారంతో తాను పలు రకాల సేవాకార్యక్రమాలను నిర్వహించని భవిష్యత్తులో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు

అనంతరం స్థానిక విద్యా సంస్థ విద్యార్థులకు పాఠశాల అధ్యాపకులు బృందం సౌజన్యంతో బహుమతులను అందజేశారు.

వైద్య ఖర్చులు నిమిత్తం ఒక వ్యక్తికి 5వేల రూపాయలు నగదు ను పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు, న్యాయవాది షేక్ షబ్బీర్, పూర్వ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు బాదుల్లా పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయులు మూసా జానీ ,సోమ రాజు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.