మాదాలవారిపాలెం సోసైటికి త్రీ సభ్య కమిటీ ఏర్పాటు

మాదాలవారిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు ముగ్గురు సభ్యుల కమిటీని ఎంపిక చేస్తు డివిజన్ కో ఆపరేటివ్ అధికారి ఉత్తర్వులు జారీచేశారు.

అన్నవరం గ్రామ పంచాయతీ చెందిన కొత్తపులి బ్రహ్మ రెడ్డి చైర్మన్ గా సభ్యులుగా మాదాల వారి పాలెం చెందిన అనికాల ఈశ్వర్ రెడ్డి,కుంచేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పేరం నాగిరెడ్డి లను సభ్యులుగా నియమిస్తూ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ కొత్తపులి బ్రహ్మ రెడ్డి తెలిపారు.

తనకు చైర్మన్ పదవి లభించుటకు కారణమైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డిని తన అనుచరులతో కలిసి ఘనంగా సత్కరించారు.