కరపత్రం ఆవిష్కరించిన డీఎస్పీ, యస్ఐ

పోలీస్ వారి కరపత్రాన్ని దరిశి డియస్పీ నాగరాజు పొదిలి యస్ఐ శ్రీరామ్ లు ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం స్థానిక చిన్న బస్టాండ్ నందు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా ఉండే విధంగా తీసుకోవాలసిన జగ్రత్తలు, రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, మహిళల భద్రత మొదలైన అంశాల గురించి వివరించారు.

అనంతరం అవగాహనకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు