బస్సు బైక్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

బస్సు బైక్ ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి నుండి గోగినేని వారి పాలెం గ్రామానికి బైకుపై దాసరి చెన్నకేశవులు అతని వదిన వెళ్తుండగా పొదిలి పంచాయతీ పరిధిలోని కాటూరి వారిపాలెం గ్రామ సమీపంలో ఒంగోలు నుండి మార్కాపురం వెళుతున్న మార్కాపురం డిపో బస్సును ఢీకొనడంతో చెన్నకేశవులు తీవ్రంగా గాయపడగా అతని వదినకు స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన వారిని 108వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీరామ్ వైద్యశాలకు చేరుకుని గాయపడిన వ్యక్తిని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.