ప్రకాశం జిల్లా అభ్యర్థులతో జనసేనాని భేటీ

ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

వివరాల్లోకి వెళితే శనివారం విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను గురించి భవిష్యత్ కార్యచరణ మరియు గ్రామ స్ధాయి నుండి పార్టీ నిర్మాణం మొదలగు అంశాలు గురించి చర్చించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు, దరిశి, గిద్దలూరు, నియోజకవర్గాల అభ్యర్థులు ఇమ్మడి కాశీనాథ్, బైనబోయిన చంద్రశేఖర్ యాదవ్, బొటుకు రమేష్, షేక్ రియాజ్, మరియు ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.