తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు (24) మృతి చెందాడు.

పొదిలి స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారంనాడు మధ్యాహ్నం సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సుబ్బరాయుడు, చరణ్ లు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే…. కాగా వీరిరువుని ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పేర్నమిట్ట సమీపంలో సుబ్బరాయుడు మృత్యువాత పడగా…. చరణ్ అనే యువకుడికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు …. ప్రస్తుతం చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.