“స్పందన” కార్యక్రమానికి అర్జీల వెల్లువ …..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మొదటి వారం కంటే స్పందన కార్యక్రమానికి రెండో వారం ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్ నందు ప్రజలు రేషన్ కార్డులు, పెన్షన్, గృహాలు, ఇంటి నివేశన స్థలాలు తదితరాలపై పలు రకాల అర్జీలను రెవిన్యూ సిబ్బందికి సమర్పించి రసీదులను పొందారు.

ఈ సందర్భంగా మొత్తం 519అర్జీలు వచ్చాయని స్థలాల కోసం- 178పెన్షన్ల కోసం- 168 గృహాల కోసం-22 రేషన్ కార్డుల కోసం -148 వచ్చాయని….. అర్జీలను ఆన్లైన్ నందు పరిశీలించి అర్హులైన వారికి సత్వర పరిష్కారం లభించేలా చేస్తామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.