తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకరరావు….

నూతన తహశీల్దార్ గా జె ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు పొదిలి మండల రెవిన్యూ నూతన తహశీల్దార్ గా జె ప్రభాకరరావును ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు .

ఈ సందర్భంగా పొదిలి టైమ్స్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ గత 30సంవత్సరాలుగా జిల్లాలో రెవిన్యూ శాఖలో పలు హోదాలలో పని చేసిన అనంతరం ఫిబ్రవరిలో తహశీల్దార్ గా పదోన్నతి పొంది ఎన్నికల సమయంలో వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండల రెవిన్యూ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని….. జిల్లాలో తొలిసారిగా పొదిలి తహశీల్దార్ గా నియమించారని అయిన అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయదానికే తొలి ప్రాధాన్యతనిస్తామని…. అలాగే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే వారికి కావలసిన ధ్రువీకరణ పత్రాలు అందించే విధంగా కృషి చేస్తానని….. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.