అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు…..

గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారంనాడు పొదిలిలోని సాయిబాబా ఆలయాలు అలాగే వీధులలో ఏర్పాటు చేసిన మందిరాలలో భక్తులు ఉదయం నుండే భారీగా చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన గ్రామోత్సవం కార్యక్రమానికి పాతూరులోని సాయిబాబా ఆలయం నుండి భారీగా భక్తులు పాల్గొని కోలాటం, సాయికీర్తనలు అలపిస్తూ చిన్నబస్టాండ్, పెద్దబస్టాండ్, మీదుగా మరలా సాయిబాబా ఆలయం వరకు జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు,గ్రామస్థులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా సాయిబాబా వేషధారణలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.