మతిస్థిమితం లేక వ్యక్తి మృతి…

మతిస్థిమితం లేక పారిపోయిన వ్యక్తి మృతిచెందిన సంఘటన కొనకనమిట్ల మండల పరిధిలోని దొనకొండ అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కొనకనమిట్ల మండలానికి చెందిన దొనకొండ క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ పొలంలో మృతదేహాన్ని గుర్తించిన పొలం యజమాని ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పొదిలి సిఐ శ్రీరామ్, కొనకనమిట్ల ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ లు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగిందని….. మృతుని కుటుంబ సభ్యులును విచారించగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కొండగం జిల్లా ఉత్తిలి గ్రామానికి చెందిన కుటుంబం పొదిలిలోని ఓ బోర్ వెల్స్ యజమాని వద్ద పని నిమిత్తం రాగా…… అందులో కన్నె మండారి (35) మతిస్థిమితం సరిగా లేక గత మూడు రోజుల నుండి ఇంటినుండి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని….. మతిస్థిమితం లేకపోవడంతో తిరుగుతూ ఆహారం లేక మృతి చెంది ఉండవచ్చని అన్నారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని….. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.