“స్పందన” కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ …..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి నాలుగవవారం ప్రజలు “స్పందన” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్ నందు ప్రజలు రేషన్ కార్డులు, పెన్షన్, గృహాలు, ఇంటి నివేశన స్థలాలు తదితరాలపై పలు రకాల అర్జీలను రెవిన్యూ సిబ్బందికి సమర్పించి రసీదులను పొందారు.

ఈ సందర్భంగా గత  మూడు వారముల కంటే కూడా ఎక్కువ మొత్తంలో 1253అర్జీలు వచ్చాయని……. స్థలాల కోసం – 694, పెన్షన్ల కోసం – 240, గృహాల కోసం -142, రేషన్ కార్డుల కోసం -173, ఇతరములు – 4…. అర్జీలను స్వీకరించి రసీదులు ఇవ్వడం జరిగిందని….. ఆన్లైన్ నందు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వర పరిష్కారం లభించేలా చేస్తామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.