ఉద్యోగ భద్రత కల్పించాలని 108సిబ్బంది మెరుపు సమ్మె….

ఉద్యోగ భద్రత కల్పించాలని 108 అత్యవసర సేవల సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు.

వివరాల్లోకి వెళితే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 108అత్యవసర సేవల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 108సిబ్బంది మెరుపుసమ్మెకు దిగారు.

ఈ సమ్మెలో భాగంగా పొదిలిలోని స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్ విగ్రహానికి సమర్పించి వారి నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల 108సిబ్బంది మాట్లాడుతూ మాయొక్క న్యాయపరమైన డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలపాలని వారు కోరారు.