సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేసిన 108సిబ్బంది ….

వివరాల్లోకి వెళితే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 108అత్యవసర సేవల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బుధవారంనాడు 108సిబ్బంది సమ్మెను నిర్వహించిన సంగతి తెలిసిందే.

గురువారంనాడు పొదిలి, కొనకనమిట్ల 108సిబ్బంది పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావుకు వినతిపత్రం అందజేసి మాయొక్క న్యాయపరమైన డిమాండ్ల అమలుకు అలాగే ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.