సినీఫక్కీలో 1.60లక్షల రూపాయలు అపహరించిన దుండగులు….

పట్టణంలోని స్థానిక విశ్వనాథపురం 4వలైనులో నివాసం ఉంటున్న టీచర్ రెడ్డిబోయిన కోటేశ్వరరావును ఏమార్చిన నలుగురు దుండగులు సినీఫక్కీలో 1.60లక్షల అపహరించిన సంఘటన శుక్రవారంనాడు సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే టీచర్ కోటేశ్వరరావు ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి వస్తూ తన కుమారుడి ఫీజు నిమిత్తం విశ్వనాథపురంలోని ఓ బ్యాంకు నందు 2లక్షల రూపాయలను విత్ డ్రా చేసి ఆ నగదులో 40వేల రూపాయలను తన జేబులో పెట్టుకుని మిగిలిన 1.60లక్షల రూపాయలను తన చేతిరుమాలులో చుట్టి బైకు బ్యాగులో పెట్టుకుని ఇంటి ముందుకు రాగానే వెనుక రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులలో ఒక బైకుపై ఉన్న ఇద్దరు “సార్ మీ డబ్బులు కిందపడ్డాయంటూ” చెప్పడంతో బైకును నిలిపి 4అడుగులు వెనక్కి వేయగానే అప్పటికే ఇంకో బైకుపై ఉన్న మరో ఇద్దరు దుండగులు బైకులో ఉన్న డబ్బును తీసుకుని మెరుపు వేగంతో వారి వాహనాలపై నలుగురు దుండగులు పరారవ్వడంతో….. సదరు బాధిత ఉపాధ్యాయుడు వెంబడించినప్పటికి లాభం లేకపోవడంతో పొదిలి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.

బాధిత ఉపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు బ్యాంకు వద్దనుండి తనను అనుసరించి ఉండవచ్చని…. బైకులపై వచ్చిన దుండగులు ఇద్దరు కర్చీఫ్ లు కట్టుకుని ఉండగా నడిపేవారు మాత్రం హెల్మెట్లు పెట్టుకున్నట్లు తెలిపారు.