పర్యావరణ పరిరక్షణపై వినూత్న అవగాహన ర్యాలీ నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక సభ్యులు….

జనవిజ్ఞాన వేదిక జిల్లా 16వ వార్షికోత్సవ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు స్థానిక చిన్న బస్టాండ్ సెంటర్ నుండి విశ్వనాథపురం జూనియర్ కాలేజి వరకు జనవిజ్ఞాన వేదిక సభ్యులు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను అబ్బురపరిచే విధంగా మేజిషియన్ బివి రామన్ కళ్ళకు గంతలు కట్టుకోవడమే కాకుండా నల్లటి ముసుగుధరించి స్థానిక చిన్నబస్టాండ్ సెంటర్ నుండి బైకుపై జూనియర్ కాలేజి గ్రౌండ్ వరకు రావడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రారంభానికి ముందు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మరియు మండల వివిధ పార్టీల నాయకులు ముసుగును పరీక్షించిన అనంతరం….. ఉడుముల శ్రీనివాసులురెడ్డి జనవిజ్ఞాన వేదిక జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గునుపూడి భాస్కర్, శ్రావణి వెంకటేశ్వర్లు, సయ్యద్ ఖాదర్ బాషా, పలువురు నాయకులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.