ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే చంద్రశేఖరాపురం నుండి ఒంగోలుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామయ్య, నారాయణమ్మలకు ఆగ్రహరం సమీపంలోకి రాగానే ఆటో ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు.