ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

స్థానిక మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పెండింగ్ డిఏ బకాయిలు, పిఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఇహెచ్ఎస్ కార్డులు జారీ, అధికధరలను తగ్గించాలని, మహిళలకు 5రోజుల ప్రత్యేక సెలవులు మొదలగు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఎం రఫీ, ఎస్ కె బాదుల్లా, డిఎల్ నరసింహం, షేక్ మదార్ వలి, నాగూర్ వలి, శేషగిరి, సందాని బాషా, శైలజ, విజయలక్ష్మి మరియు ఉద్యోగులు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.