ఈ చలానాలు 15 రోజుల్లో మీ సేవ కేంద్రాలలో చెల్లించాలి: యస్ఐ సురేష్

పోలీసుల తనిఖీలలో భాగంగా వాహనదారులకు ఈ-చలానాలు వ్రాసిన వారికి సంక్షిప్త సమాచారం వారి చరవాణికి రాగానే…. దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాలలో సంబంధించిన చలానా రుసుము 15రోజల్లో చెల్లించాలని లేకపోతే వాహనం సీజ్ చేసి స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపించడం జరుగుతుందని… తద్వారా వాహనదారులు కోర్టు ద్వారా మరలా వాహనాలు తీసుకోవాలసిఉంటుందని కావున చాలానాలు త్వరగా చెల్లించి సమయం ఆదా చేసుకోవాలని పొదిలి యస్ఐ సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో వాహనదారులకు సూచించారు.