కఠారి రాజు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన అభిమానులు

ప్రధమ చికిత్సా కేంద్ర వైద్యులు మరియు తెదేపా నాయకులు కఠారి రాజు ప్రధమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే కఠారి రాజు ప్రధమ వర్ధంతి సందర్భంగా విశ్వనాథపురంలోని స్థానిక రాజు ఆసుపత్రి వద్ద కఠారి రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, అభిమానులు రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి “అమర్ రహే కఠారిరాజు” అంటూ నినాదాలు చేశారు.

అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ కఠారి రాజు ప్రజా వైద్యులుగా పేద ప్రజలకు వైద్యం వ్యాపారంగా కాకుండా ప్రజాసేవలా చేశారని…. అలాగే ఓ నాయకుడిగా అందరిని ముందుకు నడిపించారని అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అయినా ప్రజల మనసులో అంతటి గొప్పస్థానం ఏర్పరచుకోవడం ద్వారా ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కఠారి రాజు కుటుంబ సభ్యులు కఠారి చిన్నరాజు, సుబ్బరాజు, భరత్ చంద్ర, తెదేపా నాయకులు కాటూరి నారాయణబాబు, ఇమాంసా, జయదేవ్, షేక్ జిలాని, ఖుద్దుస్, వెంకటేశ్వరరెడ్డి, సులేమాన్ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.