వార్డుల్లో కుందూరు విస్తృత పర్యటన

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పొదిలి గ్రామ పంచాయతీ వార్డుల్లో గురువారంనాడు విస్తృతంగా పర్యటించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీలోని 1,23,4 వార్డులైన నేతపాలెం, దాసరిగడ్డ, తూర్పుపాలెం పడమటిపాలెం మసీద్ తోట, నవాబ్ మిట్ట తదితర వార్డుల వీధులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు