ద్విచక్ర వాహనంపై నుండి జారిపడి తీవ్రంగా గాయపడిన ఆంగన్ వాడి కార్యకర్త

ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు జరిపడిన ఆంగన్ వాడి కార్యకర్త తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే చింతగంపల్లి గ్రామానికి చెందిన అంగన్ వాడి కార్యకర్త పొలిరెడ్డి నిర్మల ప్రాతీయ సమావేశంకోసం కాటురిపాలెం వెళ్తుండగా చింతగంపల్లి వేగ నిరోధకాల వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై జారిపడి తీవ్రంగా గాయపడగా 108వాహనం ద్వారా స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు.