లోక్ అదాలత్ లో 68 కేసులు రాజీ

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పొదిలి మండల న్యాయ సేవాధికారసంస్ధ జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో స్ధానిక జూనియర్ సివిల్ కోర్టు నందు శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో క్రిమినల్ కేసులు – 54, సివిల్ కేసులు – 07, భరణం కేసులు -5, గృహ హింస కేసులు 02 మొత్తం 68 కేసులు పరిష్కారం జరగగా మొత్తానికి 15 లక్షల 21వేల 160రూపాయలు పరిహారం ఇప్పించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ గంజి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవటం ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని గ్రామాలలో శాంతి ఉన్నప్పుడే దేశం అబివృద్ది చెందుతుందని మరియు బంధాలు పెంపొందుతాయని కావున కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. . ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ శ్రీరామ్, ఎస్ఐ సురేష్, కొనకనమిట్ల ఎస్ఐ నాయక్, మర్రిపూడి యస్ఐ సుబ్బారావు బార్ అసోసియేషన్ నాయకులు షేక్ షబ్బిర్ , యస్ యం భాషా , జి శ్రీనివాసులు , బి వెంకటేశ్వర్లు, సుజాత, కుమారి , యం వి రమణ కిషోర్, బి రాంబాబు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.