శాసనసభ్యులను కలిసిన పుల్లగొర్ల… మార్కెట్ కమిటీ చైర్మన్ తమకు కేటాయించాలని వినతి

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కంభాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ కలిసి తమకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు మార్కాపురంలోని శాసనసభ్యులు నాగార్జున రెడ్డి నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందజేసి పార్టీ ఆవిర్భావం నుండి తమ కుటుంబం పార్టీలో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామని మాయొక్క కుటుంబ సేవలను గుర్తించి మా కుటుంబ సభ్యురాలైన పుల్లగొర్ల పద్మావతికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.