చేతివృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఐ కార్యదర్శి రత్నం

చేతివృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పొదిలి పట్టణ కమిటీ కార్యదర్శి కె వి రత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో చేతివృత్తుల వారికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక లెనిన్ భవన్ నందు శనివారం నాడు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహశీల్దార్ ప్రభాకరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కేవీ రత్నం మీడియాతో మాట్లాడుతూ తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునే వారి కుటుంబాలకు 12500నగదు అందజేయాలని….. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని లేకపోతే ప్రత్యక్ష ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.