21వతేది లోపు అభ్యంతరాలను తెలపండి: తహశీల్దారు ప్రభాకరరావు

మే 21వతేది లోపు మండల పరిధిలో ఎంపిక చేసిన ఇంటి నివేశన స్థలాల జాబితాపై అభ్యంతరాలను తెలపాలని మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.

వివరాల్లోకి వెళ్లితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 25లక్షల మందికి ఇంటి నివేశన స్థలాల పంపిణీలో భాగంగా మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వారు తయారుచేసిన అర్హుల జాబితాను వారివారి పరిధిలోని గ్రామ సచివాలయాలలో అందుబాటులో ఉంచినట్లు మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు శనివారం పొదిలి టైమ్స్ కు తెలిపారు.