హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

హెల్పింగ్ ఫ్రెండ్స్ పొదిలి వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారంనాడు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే జాతీయ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు డాక్టర్ చక్రవర్తి చేతుల మీదుగా హెల్పింగ్ ఫ్రెండ్స్ సంస్థ పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్పూర్తితో హెల్పింగ్ ఫ్రెండ్స్ పొదిలి పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని……. భవిష్యత్తులో ఇతర మిత్రులను కలుపుకుని తాము మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైపుల రమణారెడ్డి,శీరిషా , సుబ్బారెడ్డి,శివా రాఘవ రాజు, ఈనాడు బాజీ, సుబ్బారావు, సంస్థ నిర్వాహకులు  కుప్పం సుమన్, గండురు బ్రహ్మ నాయుడు, గుడూరి స్వర్ణ కుమార్, చీమలమర్రి రవి, రవీంద్రనాథ్ ,మల్లయ్య ,తదితరులు పాల్గొన్నారు