రైళ్ళు నో…. బస్సులు ఓకే

లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం కీలక నిర్ణయంతో లాక్‌డౌన్‌ను మే 31వరకు పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.

కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మే 31వరకు మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేస్తూ….. కరోనా హాట్‌స్పాట్లలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31వరకు మూసివేసే ఉంటాయని….. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31వరకు తెరిచేందుకు అనుమతి లేదని….. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది.

మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని….. కంటోన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని స్పష్టంచేస్తూ…. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కల్పించింది కేంద్రప్రభుత్వం.

అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని…. రెస్టారెంట్లకు డోర్ డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.