పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు డిమాండ్

వేలం కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం నాడు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు వేలంలో పాల్గొని కొనుగోలును పరిశీలించి పొగాకు బోర్డు అధికారులు మాట్లాడి తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అదే విధంగా వేలం కేంద్రంలో రైతులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు