భారత ప్రభుత్వ నోటరిగా రమణ కిషోర్ నియామకం

భారత ప్రభుత్వ నోటరిగా పొదిలి పట్టణానికి చెందిన మునగాల వెంకట రమణ కిషోర్ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో ఐదు సంవత్సరాలపాటు నోటరిగా పని చేసినందుకు గాను నోటరి చట్టం 1952(53అప్1952) ప్రకారం మునగాల వెంకట రమణ కిషోర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.